చికెన్, గుడ్లు లల్లో నిజంగా ప్రోటీన్ ఉందా !
కొన్ని నిజాలు తెలుసుకుందాం...
మీరు ఎంత హై టెంపరేచర్ మీద వండిన అందులోని క్రిమి చస్తుందేమో కానీ రోగం చావదు. ఒకవేళ కోడికి birdflu కానీ ఇంకా ఏదైనా వ్యాధి వచ్చినపుడు ఆ కోడికి వ్యాధి సోకుతుంది, అది మీరు వండి తిన్నా మనకు ప్రాబ్లెమే, కాబట్టి వ్యాధి ఉన్నపుడు తినకపోవడమే మంచిది.
ఇంకొక విషయం ఎండాకాలంలో కోళ్లకు ఎక్కువగా వ్యాధులు సోకుతాయి, గుడ్లు కూడా త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఎండాకాలంలో చికెన్ మరియు గుడ్లు తినకపోవడమే మంచిది. ఒకప్పుడు ఎండాకాలంలో చికెన్, గుడ్ల రేటు తక్కువ చేసేవారు, అవి త్వరగా అమ్ముడు పోవాలని, కానీ ఇప్పుడు అవి ప్రోటీన్ అని అబద్దం చెప్పడంతో జనాలు ఎగబడి తింటున్నారు.
మరి చికెన్, గుడ్ల లో నిజంగా ప్రోటీన్ ఉందా!
ఉంది. కానీ పప్పు దినుసులతో పోలిస్తే చికెన్, గుడ్ల లో ప్రోటీన్ తక్కువే. చికెన్ 100gms, బాదం పప్పు 100gms తీసుకుందాం. చికెన్ వండటం వల్ల కొన్ని పోషకాలు, ప్రోటీన్లు పోతాయి. ఆ వండినది తిన్న తర్వాత అది అరగటానికి, శక్తిగా మారటానికి మన నుండి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అదే బాదం పప్పు వండకుండా డైరెక్ట్ గా నానబెట్టుకొని తింటే రెట్టింపు శక్తి వస్తుంది. అవి అరగడానికి చాలా తక్కువ శక్తి కావాలి. అంటే దినుసులు 90% ప్రోటీన్ ఇస్తే, ఇక్కడ చికెన్, గుడ్లు 40% శక్తి కూడా సరిగా ఇవ్వడం లేదు. మరి ఎందులో నుండి ఎక్కువ ప్రోటీన్ పొందుతున్నాం!
ఇక గుడ్లు అయితే పెసర పప్పుతో కూడా పోటీపడలేదు, మరి మన వద్ద శనగ పప్పు, కంది పప్పు, ఇంకా చెప్పాలంటే కాజు, బాదం, పిస్తా ఇలా చాలానే ఉన్నాయి, కానీ వీటి గురించి ఎవరూ చెప్పరు. ఎందుకంటే అవి తింటే డాక్టర్ల దగ్గరికి ఎవరూ వెళ్ళరు.
మరి డాక్టర్లు మరియు ఎక్స్పర్ట్స్ అని చెప్పే వాళ్ళు ఎందుకు తినుమని చెబుతున్నారు. వాళ్ళు చాలావరకు స్వయంగా చెప్పడం లేదు, కోళ్ళు, గుడ్లు బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళతో చెప్పిస్తున్నారు, వీళ్ళు గత్యంతరం లేకనో, వాటి మీద అవగాహన లేకనో తినుమని చెబుతున్నారు. చికెన్, గుడ్లు తింటే ముఖ్యంగా ఎవరు బాగు పడతారు, అమ్మే వాడు, బిజినెస్ పర్సన్. మరి పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ పండించే వాడు ఎవరు రైతు, కానీ రైతు ఎప్పుడూ రాజు కాలేడు. ఇక మీరే అర్థం చేసుకోండి.
మరి చికెన్, గుడ్లు మంచిదేనా?
ఒకప్పుడు అంటే 90 శతకం వరకు కోళ్ళు ఇంట్లోనే పెంచుకునే వారు. వాటి నుండి వచ్చిన గుడ్లనే తినేవారు. అప్పట్లో కూరగాయలు చాలా తక్కువనే తినేవారు. చికెన్, గుడ్లు లేదా మాంసం వారానికి ఒకరోజు మాత్రమే తినేవారు. అప్పట్లో అంత మోసాలు, ఆశలు లేవు. అన్ని డబ్బులు కూడా లేవు. కానీ ఇప్పుడు ఎవరూ కోళ్ళని పెంచుకోవడం లేదు. అందరూ బయటనే తింటున్నారు. అది కూడా ఫారం కోడినే ఎక్కువగా తింటున్నారు. ఫారం కోడి కేజీ లేదా కేజీన్నర ఉండాల్సిన కోడి ఇప్పుడున్న కోళ్ళు 2 లేదా 3 కేజీల వరకు ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాలి. ఇప్పుడు మోసాలు ఎక్కువై పోయాయి. స్వార్ధం ఎక్కువై పోయింది. డబ్బుల కొరకు కోళ్ళకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేసి వాటి బరువు పెంచి వాటి ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. ఆ స్టెరాయిడ్స్ వల్ల అవి తిన్న మనకు క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసా! స్టెరాయిడ్స్ వాడిన గుడ్లు తినడం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అసలు చికెన్ 65 అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, ఒక కోడి 65 రోజులు పెరిగి పుష్టిగా తయారు అయిన తరువాత ఆ కోడిని వండుకొని తినేవారు. కానీ ఇప్పుడు 40 రోజులకే ఫారం కోడి 2, 3 కేజీలకు పెరిగి పోతుంది. మరి అలా పెరిగింది అంటే ఏం జరుగుతుందో ఆలోచించాలి.
బాదం పప్పు రేటు ఎక్కువా లేదా మాంసం రేటు ఎక్కువా?
బాదం పప్పు రేటు మార్కెట్ లో సుమారుగా కేజీ ₹800 నుండి ₹1200 ఉంది. బాదం పప్పు ఒక 1/2 కేజీ తెచ్చుకొని రోజుకు 2, 3 బాదం పప్పులు నానబెట్టుకొని తిన్నా నెల మొత్తం ఇంటిల్లిపాది తినవచ్చు. హైజెనెక్ గా బ్రతకొచ్చు. చాలా శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
అదే మేక మాంసం కేజీ సుమారుగా ₹800 ఉంది. అది ఒక పూటకో లేదా ఒక రోజులో వండుకొని తింటున్నాం. మరి ఇది బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేం. మరి దీనికి నెలలో ఎంత ఖర్చు పెడుతున్నాము మనమే ఆలోచించుకోవాలి.
నాన్ వెజ్ ఎందుకు ఎక్కువ తింటున్నారు?
నాన్ వెజ్ తినటం ప్రోటీన్ కోసమో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది రుచికి మరిగి తింటూ ఉన్నారు. ఒక్కసారి మాంసం రుచి మరిగాడా ఇక మానడం కష్టమే. ఎందుకంటే మంచి మసాలా దట్టించి చేయడం వల్ల రుచిగా ఉంటుంది. ప్రోటీన్ పేరుతో మేము తినము అని చెప్పే కొందరు బ్రాహ్మణులు, వైశ్యులు కూడా మేమెందుకు తినొద్దు అని తింటున్నారు, ఇక కరోనా తరువాత మరీ ఎక్కువ అయ్యింది. చికెన్ తినండి కరోనాని ఎదుర్కోండి, చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అబద్దం చెప్పి మరీ బిజినెస్ నడిపారు. పాపం అది నమ్మి అమాయక జనాలు క్యూలో నిలబడి మరీ కొనుక్కొని ఎగబడి తిన్నారు.
కొందరు బిజినెస్ వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కొరకు డాక్టర్ల చేత ప్రోటీన్ పేరుతో తినమని చెప్పే వరకు ఇప్పటివరకు తినని వారు కూడా ఎగబడి మరీ తింటున్నారు. అన్యం పుణ్యం ఎరుగని వాళ్ల పిల్లలకు కూడా ప్రోటీన్ పేరు చెప్పి మరీ బలవంతంగా తినిపిస్తున్నారు. ఇక జిమ్ లకు వెళ్ళే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్టమొచ్చినట్లు గుడ్లు తినిపిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు పాఠ్య పుస్తకాలలో పౌష్టికాహారంలో ఆకుకూరలు, పప్పు దినుసుల గురించి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పౌష్టికాహారం అంటే పాలు, గుడ్లు, మాంసం అని మాత్రమే మార్చి ఇప్పటి తరానికి పౌష్టికాహార అర్థాన్నే మార్చేశారు. ఇక ఇప్పటి తరం ఏమి నేర్చుకుంటుంది. ప్రతీ విద్యార్థికి ఒకటి పోయి, రెండు గుడ్లు పెడుతున్నారు. మరి ఆరోగ్యం ఎటు పోతుంది. ఒకప్పుడు డబ్బులున్నపుడో, ఆదివారమో, పండుగకో లేక చుట్టం వచ్చినపుడో కోడి యో, మాంసము తెచ్చుకొని తినేవారు. కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కువై పోయి వారానికి 4 రోజులు మాంసం తిని, బోర్ కొడితే కూరగాయలు తెచ్చుకొని తింటున్నారు. కొందరి కైతే ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు అన్న చందంగా మారిపోయింది. తిని తిని రోగాలు పెంచుకుంటున్నారు.
చికెన్, గుడ్లు, మాంసం తినాలా వద్దా!
చికెన్, మాంసం తిన్నరోజు మజ్జుగా, ఆయాసంగా ఉంటాడు, మెదడు మొద్దు మారుతుంది, తెల్లారి మోషన్ పోవటానికి కష్టపడతారు. ఎందుకంటే నాన్ వెజ్ లో జీరో ఫైబర్. ఆకులు తిన్న మేక కొండలు ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి ఇంటి మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఈ రోజుల్లో 80% నాన్ వెజ్ తినేవాళ్లే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలు కూడా కేజీలకు కేజీలు తింటున్నారు. మరి అందరూ బలంగా ఉండాలి కదా, కానీ రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, నాన్ వెజ్ తినేవాళ్ళు మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది, విచిత్రం
ఏమిటంటే ప్రోటీన్ల లోపం ఇండియాలోనే అత్యధికం. మరి ఇంత నాన్ వెజ్ తింటున్నపుడు ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కానీ, లోపం ఎందుకు ఉంది.
ఆడవాళ్ళకు PCOD, రక్తహీనత మరెన్నో రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు.
హాస్పిటల్స్ కోకొల్లలుగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఈ నాన్ వెజ్ తినడం కూడా ఒక కారణమే. తక్కువగా, అకేషనల్ గా తింటే తక్కువ జబ్బులతో బయట పడతాం. పూర్తిగా మానేయడం ఉత్తమం. కానీ ఎవరి ఇష్టం వారిది. ఎవరెన్ని చెప్పినా మేమైతే తింటాం, డాక్టర్లే చెప్పంగా లేంది ఎవరెన్ని చెప్తే మాకేంటి అనుకునే వాళ్ళు కొందరుంటారు. మేం ఎప్పటినుంచో తింటున్నాం మేం బాగానే ఉన్నాం, మాకేం కాదులే అనుకునే వాళ్ళు కొందరు. ఎవరెన్ని చెప్పినా ఎంజాయ్ చేయాలి అనుకుని తినేవారు కొందరు. ఇంకా కొందరు వితండ వాదం చేసేవారు కొందరు. రోగం చెప్పి వస్తుందా. ఈ రోజుల్లో జ్ఞానానీకంటే పత్రానికే విలువ ఇస్తున్నాం. ఇక తినాలా వద్దా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే.
ఇదంతా చదువుతున్నపుడు చికెన్, గుడ్లు, మాంసం తినేవారికి ఇబ్బందిగా, కోపంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం మారదు కదా. నిజం కొద్దిగా చేదుగానే ఉంటుంది. నిజం తెలుసుకో మిత్రమా.
నవీన్ కుమార్ వల్లోజు